Tuesday, June 23, 2009

బారిస్టర్ పార్వతీశం



బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసిం హ శాస్త్రి
బాపు ,ముళ్ళపూడి వెంకట రమణల బుడుగు,చిలకమర్తి నరసిం హ శాస్త్రి గణపతి, మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి బారిష్టర్పార్వతీశం ,రవీంద్ర నాథ్ ఠాగూర్ నౌకా ప్రమాదం(మునక? )ల కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతుండగా ఆరుసంవత్సరాల క్రితం బుడుగు,ఈ మద్య గణపతి, బారిష్టర్ పార్వతీశం దొరికాయి.చిన్నప్పుడు చదివిన ఈనవలలు, మళ్ళీచదవాలనే కోరికనే ఇంతలా వెతికించింది.బారిష్టర్ పార్వతీశం పుస్త్తకం ,కొద్దిగా చినిగి పాతపడిన ప్రతిని ,పాపం విశాలాంద్రలోని మేడం నా కోసం వెతికి ఇచ్చారు.అదే మహా ప్రసాదం అని తీసుకున్నాను.

ఈ నవలని శాస్త్రి గారు 1924 న రచించారు.ఈ రచనకుదారి తీసిన విధానాలు ,ఎలా రాసారు ఈ నవల ముందుఅంతరంగం లో ఆయన ప్రియ శిష్యుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు వివరించారు.బారిస్టర్ పార్వతీశాన్ని శ్లాఘించే శ్రీ శ్రీగారి పద్యము తో అంతరంగాన్ని ముగించారు.ఆ పధ్యము:
క్షితి లో బారిస్టర్ పార్వతీశము ను చెప్పి,పిదప పలుకవలె కదా
కితకితల కితరులను భా
సిత సిత సుశ్లోకు డతడు సిరిసిరి మువ్వా!
శ్రీకాంత శర్మ గారి, ముళ్ళపుడి వెంకట రమణ గారి అంతరంగం,శ్రీ శ్రీ గారి పద్యము వందన్నర బొమ్మలు ,జోకులు ఈనవల కు స్పెషల్ అట్రాక్షన్.
లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి దేశాని కి సేవ చేయాలనీఅరాటము,ఉబలాటము,ఉత్సాహం కల ఆంద్ర సనాతన బ్రాహ్మణకుటుంబాని కి చెందిన యువకుడే పార్వతీశం.నవలంతా పార్వతీశం స్వీయ కథ చెబుతున్నట్లుగా వుంటుంది.
మాది మొగల్తూర్ లెండి .మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో ప్రసిద్ది కెక్కిన మహానగరం (ఓ అప్పటి నుండేప్రస్సిద్దా!)
అని పార్వతీశం కథ చెప్పటము మొదలు పెడతాడు. ఆ ఊరి వారందరికీ పార్వతీశం అంటే తెగముద్దు. అక్కడచదువయ్యాక నర్సాపురం లో టైలరు స్కూల్ లో ఫస్ట్ ఫార్మ్ లో చేరుతాడు. ఇక అక్కడ ఏర్పడిన వివిధ పరిచయాలు, అనుభవాల రీత్యా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకుంటాడు. మొగల్తూర్ లో బయిలుదేరిన పార్వతీశంఇంగ్లాండ్ లో అడుగు మొపటము,అతను స్కాట్లండ్ లో ని ఎడింబరో విశ్వవిద్యాలయము లో ఏం.ఏ కోర్స్ చదువుతూప్రక్కగా బారిష్టర్ పరీక్ష కి చదివి ఈ కాలం లో ఇంగ్లాండ్ లో రకరకాల అనుభవాలు గడించి ,ఒక దొరసాని పిల్ల ప్రేమకుపాత్రుడై ,మొదటి ప్రపంచ యుద్దపు(1917) చివరి సంవత్సరం బారిష్టర్ పార్వతీశం గా అవతరించి,ఇండియా కి ఓడలోరావటము,స్వగ్రామం చేరి సరస్వతి అనే అమ్మాయి ని పెళ్ళాడి,టంగుటూరి ప్రకాశం పంతులుగారి దగ్గర మద్రాసు లోఅప్రెంటిస్ గిరి పూర్తి చేసుకొని ,ఆ మీదట భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై అటువైపుగా కొంత కాలం నడిచిమామగారి సౌజన్యాన్ని ఆసరా చేసుకొని,తన జీవితం గురించి,కర్తవ్యం గురించి విజ్ఞత తో ఆలోచించి ,చివరకు తన ప్లీడరీవృత్తిని విడిచి,భార్య సరస్వతి తో మొగల్తూర్ వెళ్ళి,ఉన్న ఆస్తి పాస్తు లను చూసుకో వటము తో నవల ముగుస్తుంది.

ఆంగ్లేయ విద్య తో పాటు అబ్బవలసిన అనేక సుగుణాలు ఆనాటికి ఇతని లో కొరత పడినాయి.నేటి నాగరికత అంతాకొత్త.ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగడు. రైల్ ఎక్కినది మొదలూ అడుగడుగునా విపరీత పరిస్థితులే తారసిల్లిఎక్కడికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి ,ప్రపంచమే తలకిందులుగా అయినట్టు, రైల్ లో అతడు నడచిన నడత ,మద్రాస్లో అతను పడిన యిబ్బందులు,స్టీమర్ లో అతను పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివితీరవలసిందే.కడుపు చెక్కలయ్యెంతగా నవ్వించి,ఒక ఘట్టాని మించి ఒక ఘట్టం హాస్య ప్రధానం గా వుంటాయి.

పాత్ర స్వభావతగా మూర్ఖుడు కాడు.పరిస్థితులతనిని మూర్ఖుని గా చేసి వెక్కిరిస్తూవుంటాయి.ఈ పార్వతీశాన్ని మించినవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే! అందుకే ఈ పాత్రంటే మనకుమమత ,అభిమానం,సానుభూతి కలుగుతాయి.
మొత్తం నవల అంతా ఏకబిగిన చదివిస్తుంది.పాత కాలం రచన కదా భాష ఎలా వుంటుందో అని భయపడక్కరలేదు.సరళమైన వ్యవహావారిక భాష లోనే వుంది. ఇంకో మాట,టి.వి ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిఝంగా కొనేసిచదువుతే ,టి.వి లో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని,కరెంట్ కరుసు వుండదని ముళ్ళపూడి వారు గారెంటీఇచ్చారు.ఇంకెందుకు ఆలస్యం కొని చదివేస్తేబాగుంటుంది కదా! ధర కుడా ఎక్కువేమీ కాదు 333 రూపాయలు మాత్రమే.

2 comments:

Vinay Chakravarthi.Gogineni said...

baguntundi.chinnappudu maku 10th nandetail lo vundedi...........chaala funny book.........monna choosanu gani enduko konaledu...........ee saari choodali.

Anonymous said...

nenu e book kosam chala try chesanu doraka ledu

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి