Showing posts with label చదువరి. Show all posts
Showing posts with label చదువరి. Show all posts

Monday, November 16, 2009

ఆవాహన

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . " చారిత్రిక నవలా చక్రవర్తి " , "చారిత్రిక నవలాసామ్రాట్ " , " అభినవ పాల్కూరి " అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల "ఆవాహన " కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారిదగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము , ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట .

మాధవరావు బాంక్ ఉద్యోగి . వరంగల్ కి బదిలీ అయ్యి భార్య లక్ష్మి , కూతురు ఇందిర లతో వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని . ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .

ఓ సాయంకాలము , మాధవరావు వేయిస్తంబాలగుడి కి వెళుతాడు . గుడి లోని శిల్పాలను పరవశం గా చూస్తూ , నంది ఎదురుగా వున్న , అసంపూర్తి మంటపం లోకి వెళుతాడు . అప్పటి కే సూర్యాస్తమయం అయ్యింది . ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది .టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు .శిధిల మంటపము లో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప .
అక్కొడక నర్తకి బొమ్మ వుంది .
ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .
ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?!
మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .
అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు .
ఇంతలో చంద్రోదయమైంది .
వైశాఖపూర్ణిమ !!
పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో .
ఏమిటి చూస్తున్నావు ? ఎవరో మాధవరావును పలకరించారు .
శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .
. . . . . . . . . . . . . . . . . . . . . . .
ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .
. . . . . . . . . . . . . . . . . . . . . . . . ..
ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు .
"ఏమండీ - ఏమండీ " మాధవరావు కేకేసాడు .ఎవరూ బదులు పలకలేదు . గబ గబా మంటపమంతా వెతికాడు . ఎవరూ కనిపించలేదు .
ఆమె ఎవరు ? ప్రతి పౌర్ణమి కి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? అదీ మాధవరావుకు మాత్రమే ! అదీ పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది . ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

" కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని " . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .
" ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు - మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . " అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో !

ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668


ఇది "పుస్తకం " లో వచ్చిన నా ఆర్టికల్ .

Sunday, October 11, 2009

సద్దాం ఆంటీ ఇంటి కథ

మీరు బుక్స్ చదువుతారా ? అని సడన్ గా అడిగింది సృజన . వచ్చే ప్రమాదాన్ని పసిగట్టలేక చాలా చదువుతాను కాని , తెలుగు వే చదువుతాను అని గొప్పగా చెప్పాను . ఐతే మేమొక కొత్త బ్లాగ్ మొదలుపెట్టాము , మీరు ఏదైనా పుస్తకము గురించి, దాని తో మీకున్న అనుబంధం గురించి వ్రాసి ఇవ్వండి అంది . నేనా ! రాయటమా ! మీకోసమా ! బోలెడు హాచర్యం , ఆపై ఘాభరా ! మీరంతా బాగా చేయి తిరిగిన వారు , నా రాత ఎలా వుంటుందో ? అనే అనుమానం వ్యక్తీకరించాను . పరవాలేదు మీరూ బాగానే రాస్తున్నారు , ప్రయత్నించండి , అంటూ మీ పిల్లలకి కతలు చెపుతారుగా అవే ఏదైనా రాయండి అని క్లూ ఇచ్చింది .నాకు వెంటనే బుడుగ్గాడు గుర్తుకొచ్చాడు .
వెంటనే బుడుగు గురించి రాసాను . కాని ఎలా పంపాలి ? అప్పుడూ సృజననే చెప్పింది జి . మేయిల్ లో పేస్ట్ చేసి పంపండి అని అదే చేసాను . ఇక అప్పటి నుండి టెన్షన్ పంపాను కాని వాళ్ళు వేసుకుంటారో వేసుకోరో ! బాగా లేదు అంటారో ! అని . సృజన దగ్గరనుండి మేయిల్ వస్తుందేమో నని పడిగాపులు. . మీ పొస్ట్ పబ్లిష్ చేసాము చూడండి అంటూ చివరికి చైతన్య కళ్యాణి మేయిల్ రానే వచ్చింది . అబ్బ ఎంత సంతోషమో ! మొదటిసారి అచ్చులో మన పేరు చూసుకుంటే కలగదేమిటి ?
ఆ తరువాత బారిష్టర్ పార్వతీశం రాసి పంపాను . అదీ అచ్చేసారు . వారికి పంపే ముందే , అప్పుడు నా టెస్ట్ బ్లాగ్ గా వున్న దీనిలో పోస్ట్ చేసుకొని , చూసుకొని పంపాను . ఆ తరువాత దీనిలోని ప్రయోగాలు నచ్చి , ఎలాగు పుస్తకాల గురించి వ్రాయటము మొదలు పెట్టాను కదా ఇందులో వ్రాద్దామనుకొని కంటిన్యూ అయిపోయాను .
ఇక ప్రస్తుతానికి వస్తే నేను వ్రాసిన, మల్లాది నవల , సద్దాం ఆంటీ ఇంటి కథ పరిచయం ముచ్చటగా మూడోసారి బి @ గ లో పబ్లిష్ చేసారు .
ప్రమాదాన్ని , ప్రమోదం గా మార్చిన
గీతాచార్య గారికి ,
చైతన్య కళ్యాణి కి ,
సృజన కి ,
ధన్యవాదాలు.
http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post_10.html

Tuesday, June 23, 2009

బారిస్టర్ పార్వతీశం



బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసిం హ శాస్త్రి
బాపు ,ముళ్ళపూడి వెంకట రమణల బుడుగు,చిలకమర్తి నరసిం హ శాస్త్రి గణపతి, మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి బారిష్టర్పార్వతీశం ,రవీంద్ర నాథ్ ఠాగూర్ నౌకా ప్రమాదం(మునక? )ల కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతుండగా ఆరుసంవత్సరాల క్రితం బుడుగు,ఈ మద్య గణపతి, బారిష్టర్ పార్వతీశం దొరికాయి.చిన్నప్పుడు చదివిన ఈనవలలు, మళ్ళీచదవాలనే కోరికనే ఇంతలా వెతికించింది.బారిష్టర్ పార్వతీశం పుస్త్తకం ,కొద్దిగా చినిగి పాతపడిన ప్రతిని ,పాపం విశాలాంద్రలోని మేడం నా కోసం వెతికి ఇచ్చారు.అదే మహా ప్రసాదం అని తీసుకున్నాను.

ఈ నవలని శాస్త్రి గారు 1924 న రచించారు.ఈ రచనకుదారి తీసిన విధానాలు ,ఎలా రాసారు ఈ నవల ముందుఅంతరంగం లో ఆయన ప్రియ శిష్యుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు వివరించారు.బారిస్టర్ పార్వతీశాన్ని శ్లాఘించే శ్రీ శ్రీగారి పద్యము తో అంతరంగాన్ని ముగించారు.ఆ పధ్యము:
క్షితి లో బారిస్టర్ పార్వతీశము ను చెప్పి,పిదప పలుకవలె కదా
కితకితల కితరులను భా
సిత సిత సుశ్లోకు డతడు సిరిసిరి మువ్వా!
శ్రీకాంత శర్మ గారి, ముళ్ళపుడి వెంకట రమణ గారి అంతరంగం,శ్రీ శ్రీ గారి పద్యము వందన్నర బొమ్మలు ,జోకులు ఈనవల కు స్పెషల్ అట్రాక్షన్.
లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి దేశాని కి సేవ చేయాలనీఅరాటము,ఉబలాటము,ఉత్సాహం కల ఆంద్ర సనాతన బ్రాహ్మణకుటుంబాని కి చెందిన యువకుడే పార్వతీశం.నవలంతా పార్వతీశం స్వీయ కథ చెబుతున్నట్లుగా వుంటుంది.
మాది మొగల్తూర్ లెండి .మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో ప్రసిద్ది కెక్కిన మహానగరం (ఓ అప్పటి నుండేప్రస్సిద్దా!)
అని పార్వతీశం కథ చెప్పటము మొదలు పెడతాడు. ఆ ఊరి వారందరికీ పార్వతీశం అంటే తెగముద్దు. అక్కడచదువయ్యాక నర్సాపురం లో టైలరు స్కూల్ లో ఫస్ట్ ఫార్మ్ లో చేరుతాడు. ఇక అక్కడ ఏర్పడిన వివిధ పరిచయాలు, అనుభవాల రీత్యా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకుంటాడు. మొగల్తూర్ లో బయిలుదేరిన పార్వతీశంఇంగ్లాండ్ లో అడుగు మొపటము,అతను స్కాట్లండ్ లో ని ఎడింబరో విశ్వవిద్యాలయము లో ఏం.ఏ కోర్స్ చదువుతూప్రక్కగా బారిష్టర్ పరీక్ష కి చదివి ఈ కాలం లో ఇంగ్లాండ్ లో రకరకాల అనుభవాలు గడించి ,ఒక దొరసాని పిల్ల ప్రేమకుపాత్రుడై ,మొదటి ప్రపంచ యుద్దపు(1917) చివరి సంవత్సరం బారిష్టర్ పార్వతీశం గా అవతరించి,ఇండియా కి ఓడలోరావటము,స్వగ్రామం చేరి సరస్వతి అనే అమ్మాయి ని పెళ్ళాడి,టంగుటూరి ప్రకాశం పంతులుగారి దగ్గర మద్రాసు లోఅప్రెంటిస్ గిరి పూర్తి చేసుకొని ,ఆ మీదట భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై అటువైపుగా కొంత కాలం నడిచిమామగారి సౌజన్యాన్ని ఆసరా చేసుకొని,తన జీవితం గురించి,కర్తవ్యం గురించి విజ్ఞత తో ఆలోచించి ,చివరకు తన ప్లీడరీవృత్తిని విడిచి,భార్య సరస్వతి తో మొగల్తూర్ వెళ్ళి,ఉన్న ఆస్తి పాస్తు లను చూసుకో వటము తో నవల ముగుస్తుంది.

ఆంగ్లేయ విద్య తో పాటు అబ్బవలసిన అనేక సుగుణాలు ఆనాటికి ఇతని లో కొరత పడినాయి.నేటి నాగరికత అంతాకొత్త.ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగడు. రైల్ ఎక్కినది మొదలూ అడుగడుగునా విపరీత పరిస్థితులే తారసిల్లిఎక్కడికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి ,ప్రపంచమే తలకిందులుగా అయినట్టు, రైల్ లో అతడు నడచిన నడత ,మద్రాస్లో అతను పడిన యిబ్బందులు,స్టీమర్ లో అతను పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివితీరవలసిందే.కడుపు చెక్కలయ్యెంతగా నవ్వించి,ఒక ఘట్టాని మించి ఒక ఘట్టం హాస్య ప్రధానం గా వుంటాయి.

పాత్ర స్వభావతగా మూర్ఖుడు కాడు.పరిస్థితులతనిని మూర్ఖుని గా చేసి వెక్కిరిస్తూవుంటాయి.ఈ పార్వతీశాన్ని మించినవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే! అందుకే ఈ పాత్రంటే మనకుమమత ,అభిమానం,సానుభూతి కలుగుతాయి.
మొత్తం నవల అంతా ఏకబిగిన చదివిస్తుంది.పాత కాలం రచన కదా భాష ఎలా వుంటుందో అని భయపడక్కరలేదు.సరళమైన వ్యవహావారిక భాష లోనే వుంది. ఇంకో మాట,టి.వి ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిఝంగా కొనేసిచదువుతే ,టి.వి లో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని,కరెంట్ కరుసు వుండదని ముళ్ళపూడి వారు గారెంటీఇచ్చారు.ఇంకెందుకు ఆలస్యం కొని చదివేస్తేబాగుంటుంది కదా! ధర కుడా ఎక్కువేమీ కాదు 333 రూపాయలు మాత్రమే.
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి