Tuesday, January 26, 2010

స్వాతంత్రం




మా చిన్న తమ్ముడి ( మా పిన్ని చిన్న కొడుకు ) కుమారుడు జస్వంత్ . గూడూరు లో 9 వ తరగతి చదువుతున్నాడు . వాడికి మా కుటుంబ వారసత్వం , కవితలు రాయటము వచ్చినట్లున్నది . కవితలు రాయటము చాలా ఇష్టం . అందుకే రాత్రి అందరూ నిదురపోయిన తరువాత రాసుకుంటూ వుంటాడు . బాబ్బాబు నాకు కవితలు రాయటము రాదురా , కాసిని నీ కవితలు నాకివ్వు , నా బ్లాగ్ లో వేసుకుంటాను అంటే దయతలచి ఇచ్చాడు . అందులో ఒకటి స్వాతంత్రము మీద రాసినది , గణతంత్ర దినోత్సవము సంధర్భముగా .

ఆంగ్లేయు లు మనపై చేసిన కుతంత్రం

ఏమీ చేయలేక పోయింది ఏమాత్రం

సత్య అహింస లనే గాంధీజీ సూత్రం

" ఇంక్విలాబ్ జిందాబాద్ " అన్న ఆజాద్ గాత్రం ,

ఎదుటివారు ఎవర్నైనా చిత్తు చేసే ఖడ్గ మంత్రం

ఎందరో వీరుల రక్త స్తోత్రం వలన

దేశానికి దొరికింది స్వతంత్రం .

కాబట్టి మరువకూడదు వీరందరినీ ఏమాత్రం .


బారతీయు లందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి