Monday, November 16, 2009

ఆవాహన

ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రిక నవలా రచయతలలో సుప్రసిద్ధులు . కొన్ని వందల కథలు , వ్యాసాలు , 30 నవలలు వ్రాసారు . " చారిత్రిక నవలా చక్రవర్తి " , "చారిత్రిక నవలాసామ్రాట్ " , " అభినవ పాల్కూరి " అనే బిరుదులు సంపాదించారు . వీరి నవల "ఆవాహన " కోసం 8 సంవత్సరాలు వెతికి , చివరికి వారిదగ్గరనుంచే తీసుకున్నాను . ప్రస్తుతము , ఈ నవల చలనచిత్రము గా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట .

మాధవరావు బాంక్ ఉద్యోగి . వరంగల్ కి బదిలీ అయ్యి భార్య లక్ష్మి , కూతురు ఇందిర లతో వస్తాడు . అతని స్నేహితుడు రామచంద్ర రావు లెక్చరర్ గా వరంగల్ లో పని చేస్తుంటాడు . రామచంద్ర రావు భార్య కాత్యాయిని . ఇరు కుటుంబాల వారు చాలా స్నేహితముగా వుంటారు .

ఓ సాయంకాలము , మాధవరావు వేయిస్తంబాలగుడి కి వెళుతాడు . గుడి లోని శిల్పాలను పరవశం గా చూస్తూ , నంది ఎదురుగా వున్న , అసంపూర్తి మంటపం లోకి వెళుతాడు . అప్పటి కే సూర్యాస్తమయం అయ్యింది . ఆలయమంతా తెల్లని వెలుగులతో నిండి వుంది .టూరిస్ట్ లంతా ఒకరొకరే వెళ్ళి పోతున్నారు .శిధిల మంటపము లో ఎవ్వరూ లేరు , మాధవరావు తప్ప .
అక్కొడక నర్తకి బొమ్మ వుంది .
ఆ బొమ్మను చూస్తూ మాధవరావు అలాగే నిలబడి పోయాడు .
ఎందుకో ఆ బొమ్మను చూడగానే మాధవరావు శరీరం గగుర్పొడిచింది .
కళ్ళవెంట నీళ్ళు కారాయి .
ఏమి శిల్పమది ?
ఎంతటి రమణీయ సజీవ చిత్రణం ?!
మాధవరావు ఆ బొమ్మ ముందు తానూ ఓ బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోయాడు .
అలా ఎంత సేపు నిలబడ్డాడో తెలీదు .
ఇంతలో చంద్రోదయమైంది .
వైశాఖపూర్ణిమ !!
పుచ్చపువ్వులా చంద్రుడు వెలిగి పోతున్నాడు ఆకాశంలో .
ఏమిటి చూస్తున్నావు ? ఎవరో మాధవరావును పలకరించారు .
శిధిల మంటపం లో ఒకామె కూర్చొని వుంది .
. . . . . . . . . . . . . . . . . . . . . . .
ఆమె పైటచెంగు గాలికి రెపరెపలాడుతోంది .
చేతుల గాజులు మెరుస్తున్నాయి .
మెడలో బంగారు నగలు ..
ముఖం కోలగా వుంది .
సున్నితమైన పెదవులు , మృదువైన బుగ్గలు . చిన్ని నోరు , గాలికి రేగే ముంగురులు .
. . . . . . . . . . . . . . . . . . . . . . . . ..
ఆమె ఎందుకో ఒక్కసారి ఆవేశంతో ఏడ్చింది . అలా ఏడుస్తూనే శిల్పాల చాటుకు వెళ్ళిపోయినట్లనిపించింది మాధవరావుకు .
"ఏమండీ - ఏమండీ " మాధవరావు కేకేసాడు .ఎవరూ బదులు పలకలేదు . గబ గబా మంటపమంతా వెతికాడు . ఎవరూ కనిపించలేదు .
ఆమె ఎవరు ? ప్రతి పౌర్ణమి కి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? అదీ మాధవరావుకు మాత్రమే ! అదీ పదీహేను నిమిషాలు మాత్రమే వుంటుంది . ఎందుకు ? ఈ ప్రశ్నలకి సమాధానం నవలలో మాత్రమే తెలుస్తుంది .

" కళలను , రాజకీయాలతో ముడి పెట్టటము నాకిష్టము లేదు కామసాని " . ఆంటాడు శిల్పచార్యుడు , భళ్ళాల సొమేశ్వరుడు .
" ఇక్ష్వాకులు పోయారు ,విష్ణుకుండినులు పోయారు . . . . . నేడు కాకతీయులు , రేపు మరొకరు .ఇలా ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కో రాజు , ఒక్కో రాణి , వారికి ఒక్కో కూతురు , ఆ కూతురు పెళ్ళికి మనం మంటపాలు చెక్కటం . ఆ రాణీ , ఆ పెళ్ళీ ఏమీ మిగలవు - మనము చెక్కిన మంటపాలు మాత్రం మిగులుతాయి చరిత్రలో . " అంటాడు శిల్పి . ఎంత నిజమో కదా !

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం నవలనే రాసేస్తానేమో !

ఈ నవల లో రచయత కాకతీయ సామ్రాజ్యపు , వీరశైవ వైభవం , ఆనాటి సామాజిక స్తితిగతులు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు . రాణిరుద్రమదేవి కాలమునాటి వైభవము చదువుతుంటే , ఆ కాలము లో పుట్టి వుంటే బాగుండేది అనిపిస్తుంది !

చదవటము మొదలు పెట్టాక సమయమే తెలీలేదు . పూర్తి చేసాక కాని తెలీలేదు , నేను కాకతీయ సామ్రాజ్యములో లేను , హైదరాబాద్లో మా ఇంట్లో వున్నాను అని . అంతగా లీనమైపోయాను !

ప్రతులకు రచయితని సంప్రదించండి .ఫోన్ నంబర్ : 27425668


ఇది "పుస్తకం " లో వచ్చిన నా ఆర్టికల్ .

2 comments:

మురళి said...

మాలగారూ.. మీరీ నవల గురించి రాసేశారన్న మాట.. ముదిగొండ గారి శైలి చాలా బాగుంటుంది.. చివరి వరకూ చదివిస్తుంది.. చదువుతానండి నేను కూడా...

జయ said...

ఆవాహన మీద రివ్యూ చాలా బాగుంది. నేనూ నీ తో పాటే ఆ బుక్ తెచ్చుకున్నాను. కాని ఏం లాభం, ఇప్పటివరకు కనీసం 30 పేజీలు కూడా చదవలేదు. మధ్యలో ఎన్ని బ్రేక్ లో. కథ మొత్తం రాసేయొచ్చుగా! అలా సస్పెన్స్ లో పెట్టే బదులు.

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి