Tuesday, June 23, 2009

బుడుగు

మా అమ్మ మాలతి చందూర్ కి చాలా పెద్ద ఫాన్.ఆవిడ లాగా మేము కూడా బాగా తెలివికల వాళ్ళము కావాలని మాచిన్నప్పుడు చాలా పుస్తకాలు చదివించేది.అది ఒక వ్యసనమైపోయిమేము వూరు వెళ్ళినా ఏఇల్లు మారినా దగ్గర లో లైబ్రరి వెతుక్కుంటాను.మేము అక్కడినుంచి వెళ్ళిపోయాక లైబ్రరి వాళ్ళు నాకోసం చాలా బెగెట్టేసుకుంటారు.ఇప్పటికీ నారాయణగూడా ఆర్.కే లైబ్రరి రషీద్ ,అప్పుడప్పుడూ ఫొన్ చేసి కుశలం అడుగుతుంటాడు.పాపం వాళ్ళ డాడీ అయితేనాకు పుస్తకాలు సరఫరా చేయలేక అబ్ మేరేకొ కితాబ్ చాప్నా పడేగా అని వాపొయేవాడు. అయితే చాపొ అన్నాను .ఆప్లిఖొ మై చాపూంగా అనేవాడు.

ఇంకా పనికి మాలిన నవలలు చదువుతావు మంచి పుస్తకాలు చదువు అని మా అమ్మ కోపం చేస్తుంది.నేనేమన్నాచిన్నదానా చితకదాన్నా!నా అంతటి దాన్నినేనయ్యను.ఇంకా సమగ్ర ఆంద్ర చరిత్ర చదువూ,కళాపూర్ణొదయం చదువూఅని కోపం చేయటానికి ? మాట కొస్తే నా మనవళ్ళూ ,మనవరాళ్ళూ కూడా వొప్పుకోరు,వాళ్ళూబెద్దవాళ్ళమయ్యమంటారు.అందరికంటే చిన్నవాడు గౌరవ్ వున్నాడా ,బుడుగు పుస్తకం లోని పేజీ అయినా తీసిఇవ్వండి టక టకా చదివేస్తాడు.వాడి కి ఐదేళ్ళే ఎలా చదువుతాడని అనుమాన మక్కరలెదు. మద్య తెలుగునేర్చుకుంటున్నాడు .అం అహ దకా వచ్చేసాయి. వాడి దగ్గర ఎంతమంది టీచరమ్మలు పనిచేసారో తెలుసా !పాపం వాళ్ళుమీ గౌరవ్ కి చెప్పలేము అని కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకునెవారు. కాని ఇప్పుడు వచ్చిన ప్రైవేటు టేచరమ్మ చాలాముదురు.వాడు ఎక్కడ దాక్కున్నా వెతికి చంకలో ఇరికించుకొని తీసుకెళుతుంది.నువ్వు నన్ను హాండిల్ చేయలేవుఅన్నాడే అనుకోండి.అదేమిటో నా ఇంకో మనవడు విక్కీ దగ్గర కూడా చాలా మంది పనిచేసారు. మీకు చెబితే హాచర్యపోతారు.వాళ్ళూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నే వెళ్ళిపోయారు.బురుగు లాగా పట్టీల నిక్కరు వేసుకుందా మను కున్నామాఎక్కడా దొరకలేదు.అంత పెద్ద అమెరికా లో వెతికానా (పట్టీలు అనకూడదుట. సస్పెండర్ అనాలిట) ఎక్కడాదొరకలేదు.కాపోతే తాత కి దొరికాయి.పక్కింటాయన వెళుతుంటే ఈయన పకింటి పిన్నిగారి మొగుడు అంటేతప్పేమిటి?అలా చూస్తాడు.మాకు గద కావాలంటే వద్దు అంటారు,కుక్క తో ఆడుకుంటా మంటే వద్దు అంటారు ,అబ్బబ్బా బెద్దవాళ్ళతో వేగలేక పోతున్నామంటే నమ్మండి.పోనీ ఈల వేద్దామంటే బాబాయిలు వాళ్ళే ఈలలేసుకొని పెళ్ళిచేసేసుకొన్నారు. మీ కెవరికైనా కావలంటే చెప్పండి ,ఘట్టిగా ఈలవేస్తాము.కాపొతే మీ వూళ్ళో జటకా బండి వుంటే చెప్పలిమరి ,మేం వచ్చి ఎక్కుతాం .మాకు ఎవరో నెత్తిన గోరింకా పాటకూడా వచ్చు.ఇంకా అలడీన్ ఖథ పాపాయి ఖథా వచ్చు. బోలెడు అవిడియాలూ ,అభిప్రాయాలూ వున్నాయి కావలంటే మీకూ చెబుతాము.మేమే బుడుగు బుడుగేమేమన్నమాట.జోరుగ గుంజు హైలెస్సా అన్నా విడిపోము.

మీకు తెలుసా!బుడుగు పుస్తకము కోసము నేను నైంటీన్ నైన్ సిక్ష్ నుంచి డికెష్టింగ్ చేస్తే ,టుతౌసండ్ టు లో విశాలాంద్రాపుస్తక ప్రపంచం లో దొరికిందన్నమాట. మేము ఒకటో ఐదో ప్పదో కొన్నాము .మా స్నేహితులందరికీఇచ్చాము.పపంచం లోని పిల్లలంతా బురుగులు(పిడుగులు)కావాలని మా అభిప్రాయం.మీరూ తొందరగా కొనేసి మీపిల్లలకి ఇవ్వండి,మీరూ చదవండి.విశాలాంద్రా పుస్తకాలయాని కి వెళ్ళి మా పేరు చెప్పండి,కుంచం రాయతీఇస్తారు.జాఠర్ ఢమాల్!

ముళ్ళపూడి వెంకటరమణ, బాపు లకు బోలెడు థాంకులు.

అవకాశమిచ్చిన రెండు జళ్ళ చైతీ కి థాంకు, శుభాశీషులు.

బారిస్టర్ పార్వతీశం



బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసిం హ శాస్త్రి
బాపు ,ముళ్ళపూడి వెంకట రమణల బుడుగు,చిలకమర్తి నరసిం హ శాస్త్రి గణపతి, మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి బారిష్టర్పార్వతీశం ,రవీంద్ర నాథ్ ఠాగూర్ నౌకా ప్రమాదం(మునక? )ల కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతుండగా ఆరుసంవత్సరాల క్రితం బుడుగు,ఈ మద్య గణపతి, బారిష్టర్ పార్వతీశం దొరికాయి.చిన్నప్పుడు చదివిన ఈనవలలు, మళ్ళీచదవాలనే కోరికనే ఇంతలా వెతికించింది.బారిష్టర్ పార్వతీశం పుస్త్తకం ,కొద్దిగా చినిగి పాతపడిన ప్రతిని ,పాపం విశాలాంద్రలోని మేడం నా కోసం వెతికి ఇచ్చారు.అదే మహా ప్రసాదం అని తీసుకున్నాను.

ఈ నవలని శాస్త్రి గారు 1924 న రచించారు.ఈ రచనకుదారి తీసిన విధానాలు ,ఎలా రాసారు ఈ నవల ముందుఅంతరంగం లో ఆయన ప్రియ శిష్యుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు వివరించారు.బారిస్టర్ పార్వతీశాన్ని శ్లాఘించే శ్రీ శ్రీగారి పద్యము తో అంతరంగాన్ని ముగించారు.ఆ పధ్యము:
క్షితి లో బారిస్టర్ పార్వతీశము ను చెప్పి,పిదప పలుకవలె కదా
కితకితల కితరులను భా
సిత సిత సుశ్లోకు డతడు సిరిసిరి మువ్వా!
శ్రీకాంత శర్మ గారి, ముళ్ళపుడి వెంకట రమణ గారి అంతరంగం,శ్రీ శ్రీ గారి పద్యము వందన్నర బొమ్మలు ,జోకులు ఈనవల కు స్పెషల్ అట్రాక్షన్.
లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి దేశాని కి సేవ చేయాలనీఅరాటము,ఉబలాటము,ఉత్సాహం కల ఆంద్ర సనాతన బ్రాహ్మణకుటుంబాని కి చెందిన యువకుడే పార్వతీశం.నవలంతా పార్వతీశం స్వీయ కథ చెబుతున్నట్లుగా వుంటుంది.
మాది మొగల్తూర్ లెండి .మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో ప్రసిద్ది కెక్కిన మహానగరం (ఓ అప్పటి నుండేప్రస్సిద్దా!)
అని పార్వతీశం కథ చెప్పటము మొదలు పెడతాడు. ఆ ఊరి వారందరికీ పార్వతీశం అంటే తెగముద్దు. అక్కడచదువయ్యాక నర్సాపురం లో టైలరు స్కూల్ లో ఫస్ట్ ఫార్మ్ లో చేరుతాడు. ఇక అక్కడ ఏర్పడిన వివిధ పరిచయాలు, అనుభవాల రీత్యా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకుంటాడు. మొగల్తూర్ లో బయిలుదేరిన పార్వతీశంఇంగ్లాండ్ లో అడుగు మొపటము,అతను స్కాట్లండ్ లో ని ఎడింబరో విశ్వవిద్యాలయము లో ఏం.ఏ కోర్స్ చదువుతూప్రక్కగా బారిష్టర్ పరీక్ష కి చదివి ఈ కాలం లో ఇంగ్లాండ్ లో రకరకాల అనుభవాలు గడించి ,ఒక దొరసాని పిల్ల ప్రేమకుపాత్రుడై ,మొదటి ప్రపంచ యుద్దపు(1917) చివరి సంవత్సరం బారిష్టర్ పార్వతీశం గా అవతరించి,ఇండియా కి ఓడలోరావటము,స్వగ్రామం చేరి సరస్వతి అనే అమ్మాయి ని పెళ్ళాడి,టంగుటూరి ప్రకాశం పంతులుగారి దగ్గర మద్రాసు లోఅప్రెంటిస్ గిరి పూర్తి చేసుకొని ,ఆ మీదట భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై అటువైపుగా కొంత కాలం నడిచిమామగారి సౌజన్యాన్ని ఆసరా చేసుకొని,తన జీవితం గురించి,కర్తవ్యం గురించి విజ్ఞత తో ఆలోచించి ,చివరకు తన ప్లీడరీవృత్తిని విడిచి,భార్య సరస్వతి తో మొగల్తూర్ వెళ్ళి,ఉన్న ఆస్తి పాస్తు లను చూసుకో వటము తో నవల ముగుస్తుంది.

ఆంగ్లేయ విద్య తో పాటు అబ్బవలసిన అనేక సుగుణాలు ఆనాటికి ఇతని లో కొరత పడినాయి.నేటి నాగరికత అంతాకొత్త.ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగడు. రైల్ ఎక్కినది మొదలూ అడుగడుగునా విపరీత పరిస్థితులే తారసిల్లిఎక్కడికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి ,ప్రపంచమే తలకిందులుగా అయినట్టు, రైల్ లో అతడు నడచిన నడత ,మద్రాస్లో అతను పడిన యిబ్బందులు,స్టీమర్ లో అతను పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివితీరవలసిందే.కడుపు చెక్కలయ్యెంతగా నవ్వించి,ఒక ఘట్టాని మించి ఒక ఘట్టం హాస్య ప్రధానం గా వుంటాయి.

పాత్ర స్వభావతగా మూర్ఖుడు కాడు.పరిస్థితులతనిని మూర్ఖుని గా చేసి వెక్కిరిస్తూవుంటాయి.ఈ పార్వతీశాన్ని మించినవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే! అందుకే ఈ పాత్రంటే మనకుమమత ,అభిమానం,సానుభూతి కలుగుతాయి.
మొత్తం నవల అంతా ఏకబిగిన చదివిస్తుంది.పాత కాలం రచన కదా భాష ఎలా వుంటుందో అని భయపడక్కరలేదు.సరళమైన వ్యవహావారిక భాష లోనే వుంది. ఇంకో మాట,టి.వి ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిఝంగా కొనేసిచదువుతే ,టి.వి లో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని,కరెంట్ కరుసు వుండదని ముళ్ళపూడి వారు గారెంటీఇచ్చారు.ఇంకెందుకు ఆలస్యం కొని చదివేస్తేబాగుంటుంది కదా! ధర కుడా ఎక్కువేమీ కాదు 333 రూపాయలు మాత్రమే.

Wednesday, June 10, 2009




గుర్రమెక్కి దర్జాగా పదకొండో సంవత్సరము లో కి ప్రవేసిస్తున్న విక్కీ కి


సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి